వార్తలకు తిరిగి వెళ్లండి

జన్నారం మండలంలోని వివిధ గ్రామాలకు వెళ్లే ప్రధాన రోడ్ల పక్కన ఎండిపోయిన చెట్లతో ప్రమాదాలు పొంచి ఉన్నాయి. మండలంలోని తపాలాపూర్ నుండి జన్నారం వరకు, జన్నారం నుండి ఇందన్ పల్లి వరకు వెళ్లే ప్రధాన రహదారి పక్కన చాలా చోట్ల పాతకాలం నాటి చెట్లు ఎండిపోయాయి.
గట్టిగా గాలి ఇస్తే రోడ్డుపై చెట్ల కొమ్మలు విరిగిపడడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఎండిపోయిన చెట్లను కొట్టించి వేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

