వార్తలకు తిరిగి వెళ్లండి
పేదలకు ఉపాధి కల్పిస్తే ఓర్వలేరా జగన్? : మంత్రి లోకేశ్ ఫైర్
రచన దేవి Jun 28, 2026 8:20 AM అమరావతి 6 viewsabout 2 hours ago

స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ బడి పిల్లలకు రుచికరమైన భోజనం పెడుతూ, మహిళలకు ఉపాధి కల్పిస్తుంటే వైకాపా అధినేత జగన్ ఓర్వలేకపోతున్నారని విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు.
కడప జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా 5 స్మార్ట్ కిచెన్లు చేపట్టామని, త్వరలో మరో 33 కిచెన్లు ఏర్పాటు చేసి 392 మందికి ఉపాధి కల్పించబోతున్నామని పేర్కొన్నారు. పేదలు బాగుపడుతుంటే జగన్కు ఎందుకు బాధ అని లోకేశ్ ప్రశ్నించారు.
Comments
Loading comments...