వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ తితిదేకి భారీ విరాళాలు ప్రకటించారు. తిరుమలకు 25 ఎలక్ట్రిక్ బస్సులను విరాళంగా ఇవ్వడంతో పాటు, 50 మంది డ్రైవర్ల జీతాలు, ఛార్జింగ్ స్టేషన్ బాధ్యతలను రిలయన్స్ భరించనుంది.
అలాగే తిరుమల గోశాలను గుజరాత్ ‘వంతారా’ తరహాలో ఆధునీకరించేందుకు అంగీకరించారు. ఆదివారం వేకువజామున ఆయన శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

