వార్తలకు తిరిగి వెళ్లండి

గూడూరు ఎమ్మెల్యే పి సునీల్ కుమార్ వల్ల నాకు ప్రాణహాని ఉందని ఇటీవలే వైసిపి పార్టీలో చేరిన పల్లి కోటేశ్వరరావు ఆరోపించారు. శుక్రవారం వైసీపీ సమన్వయకర్త బూదూరు గురవయ్యతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కోటేశ్వరరావు మాట్లాడుతూ తనపై ఎమ్మెల్యే అనుచరుల చేత అసత్య ఆరోపణలు చేయించారని తాను దళితుడిగా ఉండి ఒక దళిత వ్యక్తిపై కేసులు పెట్టించడం ఎంతవరకు సమంజసమన్నారు.
Comments
Loading comments...

