వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతకల్ కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ అధికారులు వారి కుటుంబ సభ్యుల పేరు మీద ప్రత్యేక పూజలు చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు.
అనంతరం ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. భక్తాదులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పనులను త్వరగా పూర్తి చేయాలన్నారు.
Comments
Loading comments...

