వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ త్వరలోనే ప్రపంచపు తొలి ట్రిలియనీర్గా అవతరించే అవకాశం ఉంది. ఆయనకు చెందిన అంతరిక్ష సంస్థ 'స్పేస్ఎక్స్' ఈ నెలలో చేపడుతున్న భారీ ఐపీఓ, ఆయన నికర ఆస్తి విలువను లక్ష కోట్ల డాలర్ల మైలురాయిని దాటించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ ఐపీఓ ద్వారా స్పేస్ఎక్స్ సుమారు 75 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది, ఇది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలవనుంది. దీని ద్వారా కంపెనీ మార్కెట్ విలువ 1.77 లక్షల కోట్ల డాలర్లకు చేరుకోనుండగా, సంస్థలో 82.4 శాతం ఓటింగ్ హక్కులు కలిగిన మస్క్ సంపద భారీగా వృద్ధి చెందనుంది.
Comments
Loading comments...

