వార్తలకు తిరిగి వెళ్లండి
ఎల్నినో ప్రభావం: నీటి సంరక్షణపై మంత్రి పొన్నం సమీక్ష

ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేటలో కలెక్టర్లు, అధికారులతో నిర్వహించిన సమీక్షలో క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
భవిష్యత్తులో తాగునీటి ఎద్దడి రాకుండా ప్రతి వర్షపు చుక్కనూ కాపాడుకోవాలని, రైతులు ఆరుతడి పంటలు వేయాలని సూచించారు. నీటిమట్టం పెంపునకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ అమలు చేయాలన్నారు.
Comments
Loading comments...