వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్కు చెందిన ఒలెక్ట్రా గ్రీన్టెక్ మార్చి త్రైమాసికంలో రూ.57.39 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాదితో పోలిస్తే ఇది ఏకంగా 117 శాతం వృద్ధిని నమోదు చేసింది. అలాగే ఈ త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 43.6 శాతం పెరిగి రూ.644.72 కోట్లకు చేరింది.
గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రికార్డు స్థాయిలో 1,280 విద్యుత్ వాహనాలను డెలివరీ చేసింది. ప్రస్తుతం తమ చేతిలో మరో 10,161 ఈవీ వాహనాల ఆర్డర్లు సిద్ధంగా ఉన్నాయని కంపెనీ ఎండీ మహేష్ బాబు వెల్లడించారు.
Comments
Loading comments...

