వార్తలకు తిరిగి వెళ్లండి

నేపాల్ వరదల్లో శిథిలాల కింద చిక్కుకున్న 91 ఏళ్ల గుణ మాయా బొహరా ప్రాణాలతో బయటపడ్డారు. దేవీఘాట్లోని వృద్ధాశ్రమం నుంచి ఆమెను రక్షణ సిబ్బంది జేసీబీతో బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనకు సంబంధించిన ఫొటో వైరల్గా మారింది.
వరదల్లో వృద్ధాశ్రమంలోని ఏడుగురు మృతి చెందగా.. మిగిలిన వారిని కాఠ్మాండూకు తరలించారు. బొహరాకు కాళ్లకు వైకల్యంతో పాటు చేతికి గాయమైనా.. నీటిలో తల పైకి ఉంచుకుని 2-3 గంటల తర్వాత ఆమెను రక్షించారు
Comments
Loading comments...

