వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలోని బౌధ్ జిల్లాలో శనివారం రాత్రి ఊహించని ఘటన జరిగింది. పక్షవాతంతో మంచానికే పరిమితమైన కృష్ణ చంద్ర సాహు అనే వృద్ధుడి చేతిని ఒక విషసర్పం చుట్టేసింది. పక్షవాతం వల్ల ఆయన కదల్లేక నరకయాతన అనుభవించారు.
గమనించిన కుటుంబ సభ్యులు, పామును కదిలిస్తే కాటు వేస్తుందని భయపడి 4 గంటల పాటు అలాగే నిశ్శబ్దంగా వేచి చూశారు. ఆ తర్వాత పామును పక్కకు తోలేయడంతో వృద్ధుడు కాటుకు గురికాకుండా క్షేమంగా ప్రాణాలతో బయటపడ్డారు.
Comments
Loading comments...

