వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజా సమస్యలపై ఐక్య పోరాటాలు చేయడమే సీతారాం ఏచూరికి ఘన నివాళి అని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు సిర్ల ప్రసాద్ అన్నారు. నిమ్మక అప్పన్న అధ్యక్షతన సంతాప సభ నిర్వహించారు. ఏచూరి ప్రజా ఉద్యమాలకు అంకితమైన గొప్ప నాయకుడని కొనియాడారు.
కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్లకు రాయితీలు ఇస్తూ ప్రజలపై భారాలు మోపుతోందని విమర్శించారు. ధరల పెరుగుదలపై పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

