వార్తలకు తిరిగి వెళ్లండి

జనసేనాని పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఈనెల 2న ఎచ్చెర్ల నియోజకవర్గంలో మహా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు ఇన్ఛార్జ్ డా. విశ్వక్సేన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఆ రోజున ఉదయం 8:30లకు లావేరు పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ సుభద్రాపురం, రణస్థలం మీదుగా పైడి భీమవరం వరకు సాగి తిరిగి 11 గంటలకు లావేరు చేరుకుంటుంది. జనసేన నాయకులు, జనసైనికులు, వీర మహిళలు భారీగా తరలిరావాలని కోరారు.
Comments
Loading comments...

