Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో త్వరలో ‘ఈ-సాక్ష్య’

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 7:00 AM హైదరాబాద్General
తెలంగాణలో త్వరలో ‘ఈ-సాక్ష్య’ - Udayam
నేర దర్యాప్తులో ఆధారాలను డిజిటల్‌గా భద్రపరిచే ‘ఈ-సాక్ష్య’ విధానం త్వరలో తెలంగాణవ్యాప్తంగా అమల్లోకి రానుంది. నేరస్థలంలోనే వీడియోలు, ఫొటోలు, సాక్షుల వాంగ్మూలాలను నమోదు చేసి న్యాయస్థానానికి పంపనున్నారు. టైమ్‌స్టాంప్‌తో సమాచారం భద్రంగా ఉండటంతో ఆధారాలను మార్చే అవకాశం ఉండదు. దర్యాప్తులో పారదర్శకత పెరగడంతోపాటు సమయం, వ్యయం ఆదా కానున్నాయని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...