వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని దుబ్బాక గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని ఉపసర్పంచ్ కోతి శేఖర్ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్న వివిధ రిజిస్టర్లను పరిశీలించి, వాటిలో నమోదైన వివరాలను క్షుణ్ణంగా చెక్ చేశారు. పిల్లల హాజరు, పోషకాహారం, గర్భిణీలు, బాలింతలకు అందుతున్న సేవలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ఆయా తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

