వార్తలకు తిరిగి వెళ్లండి
భారత్కు భారీ డ్రగ్స్ స్మగ్లింగ్

అమెరికా నుంచి భారత్కు విమాన మార్గంలో అక్రమంగా తరలిస్తున్న 22 కేజీల కొకైన్ను అమెరికా పోలీసులు పట్టుకున్నారు. మియామీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ కార్గో వేర్హౌజ్లో అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ అధికారులు ఈ డ్రగ్స్ రవాణాను సీజ్ చేశారు.
'ఆపరేషన్ స్ట్రయికర్' పేరుతో జరిపిన ఈ దాడిలో 8 ప్యాకెట్లు, నాలుగు బ్రిక్స్ రూపంలో ఉన్న వైట్ పౌడర్ను స్వాధీనం చేసుకుని, అది కొకైన్ హైడ్రోక్లోరైడ్గా అధికారులు నిర్ధారించారు.
Comments
Loading comments...