వార్తలకు తిరిగి వెళ్లండి
మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన పోటీలు

ఏర్పేడు మండలం అంజిమేడులోని శ్రీ ఈశ్వర్ రెడ్డి లా కళాశాలలో సోమవారం మాదకద్రవ్యాల నిర్మూలనపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ నిత్యాదేవి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు "మాదకద్రవ్యాలు - గంజాయి ముప్పు" అనే అంశంపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
యువతపై మాదకద్రవ్యాల దుష్ప్రభావాలు, వీటిని నిర్మూలించేందుకు తీసుకోవాల్సిన చట్టపరమైన మరియు సామాజిక చర్యల గురించి విద్యార్థులు వివరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.
Comments
Loading comments...