వార్తలకు తిరిగి వెళ్లండి
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని నాగారం డివిజన్ దత్తాత్రేయ నగర్ కాలనీలో నాలుగు నెలలుగా తాగునీటి సమస్య నెలకొంది. 15 రోజులకు ఒకసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అదీ సక్రమంగా రావడం లేదని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని కాలనీవాసులు కోరుతున్నారు.
Comments
Loading comments...

