Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు: రేవంత్

ప్రణీత రెడ్డి Jun 26, 2026 7:38 PM హైదరాబాద్ 1 viewsabout 1 hour ago
మూసీ నిర్వాసితులకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు: రేవంత్ - Udayam Digital
మూసీ నది పరీవాహక ప్రాంతంలో (రివర్‌బెడ్‌) నివసిస్తున్న వారికి డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు తొలిదశ పనులపై ఆయన ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. భూసేకరణలో భాగంగా ప్రజలకు తగిన పరిహారం లేదా టీడీఆర్ (TDR) ఇవ్వాలని సూచించారు. అలాగే, ప్రజలకు అవగాహన కల్పించేందుకు నెక్లెస్ రోడ్డులో 'మూసీ ఎక్స్‌పీరియన్స్ సెంటర్'ను ఏర్పాటు చేయాలని, అక్కడే ప్రాజెక్టుపై ప్రజల అభిప్రాయాలు కూడా సేకరించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి పొంగులేటి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...