వార్తలకు తిరిగి వెళ్లండి
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
భరత్ తేజ Jun 26, 2026 12:38 PM హైదరాబాద్ 3 viewsabout 2 hours ago

డ్రగ్స్ బారిన పడి యువత తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హెచ్చరించారు. డ్రగ్స్ కట్టడికి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని, ఇందులో ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
సమాజ శ్రేయస్సు కోసం పోలీసులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. డ్రగ్స్ రహిత తెలంగాణ నిర్మాణానికి సినీ ప్రముఖుల సందేశాలు, ప్రజా భాగస్వామ్యం ఎంతో అవసరమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Comments
Loading comments...