వార్తలకు తిరిగి వెళ్లండి

కొల్లూరు మండలం దోనేపూడి కరకట్ట వద్ద సమాధుల ప్రాంతంలో ఆదివారం పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై కిశోర్బాబు తెలిపారు. వారి నుంచి రూ.17,500 నగదును స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు. పేకాట, కోడిపందేలపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని కోరారు.
Comments
Loading comments...

