వార్తలకు తిరిగి వెళ్లండి
విరాళాల చోరీని రాజకీయం చేయొద్దు

అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ కేసును రాజకీయం చేయొద్దని, కోర్టులు రాజకీయ వేదికలు కావు అని పిటిషనర్లకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇది కేవలం నేరానికి సంబంధించిన అంశమని, సరైన దర్యాప్తు జరిగేలా చూస్తామని తెలిపింది.
సిట్ ఏర్పాటు చేసి 8 మంది నిందితులను అరెస్టు చేసినట్లు విచారణలో ప్రభుత్వం వివరించింది. దర్యాప్తు వివరాలను తెలియజేయాలని ఆదేశిస్తూ ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు ఈ నెల 27కి వాయిదా వేసింది.
Comments
Loading comments...