వార్తలకు తిరిగి వెళ్లండి

దంతాలపల్లి మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాల్లో యూరియాను అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైతులు ఆరోపించారు. యూరియాతో పాటు ఇతర పురుగుమందులు కొనుగోలు చేస్తేనే యూరియా ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ రైతు ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. యూరియా విక్రయాలపై అధికారులు విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని రైతులు కోరారు.
Comments
Loading comments...

