వార్తలకు తిరిగి వెళ్లండి
నిజామాబాద్ జైలులో కలకలం

నిజామాబాద్ జైలులో వార్డర్లు ఖైదీలతో చేతులు కలపడం, గంజాయి కొట్లాటలు, ఫోన్ల ద్వారా బెదిరింపుల వంటి వరుస ఘటనలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. సిబ్బంది కొరత, అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ అరాచకాలు జరుగుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
ప్రస్తుతం 350 మంది సామర్థ్యం ఉన్న ఈ జైలులో రెట్టింపు సంఖ్యలో 680 మంది ఖైదీలు మగ్గుతున్నారు. దీంతో నిఘా కొరవడిందని, ప్రక్షాళన కోసం ఉన్నతాధికారులు సిబ్బందిపై చర్యలకు నడుం బిగించారని సమాచారం.
Comments
Loading comments...