వార్తలకు తిరిగి వెళ్లండి
పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ

వైకాపా పాలనలో రైతులు భూ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే ఆదితి గజపతిరాజు ఆరోపించారు. గురువారం విజయనగరం మండలం మలిచర్లలో రైతులకు ఆమె పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు.
కూటమి ప్రభుత్వం రైతుల ఇబ్బందులను తొలగించేందుకు సకాలంలో పాస్ పుస్తకాలు అందిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. భూ సమస్యలన్నింటినీ పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.
Comments
Loading comments...