Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ

స్వాతి రెడ్డి Jul 02, 2026 9:36 AM విజయనగరం 3 viewsabout 1 hour ago
పట్టాదార్ పాస్ పుస్తకాల పంపిణీ - Udayam Digital
వైకాపా పాలనలో రైతులు భూ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారని ఎమ్మెల్యే ఆదితి గజపతిరాజు ఆరోపించారు. గురువారం విజయనగరం మండలం మలిచర్లలో రైతులకు ఆమె పట్టాదార్ పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం రైతుల ఇబ్బందులను తొలగించేందుకు సకాలంలో పాస్ పుస్తకాలు అందిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. భూ సమస్యలన్నింటినీ పూర్తి స్థాయిలో పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...