వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుపై ఈ నెల 23న హనుమకొండ-వరంగల్ ప్రెస్క్లబ్లో ఉదయం 11 గంటలకు బహిరంగ చర్చ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన కరపత్రాన్ని తెలంగాణ ప్రజా ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడు పీక కిరణ్ విడుదల చేశారు.
ఎమ్మెల్సీ కోదండరామ్, మాజీ ఎమ్మెల్సీ సబావత్ రాములునాయక్ తదితరులు పాల్గొంటారని పీక కిరణ్ తెలిపారు. ఉద్యమకారుల సమస్యలు, గుర్తింపు అంశాలపై చర్చ జరుగుతుందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

