వార్తలకు తిరిగి వెళ్లండి
సింగరేణిలో ఇక క్రమశిక్షణే పరమావధి
పవని రెడ్డి Jun 26, 2026 5:43 AM జయ శంకర్ భూపాలపల్లి 1 viewsabout 1 hour ago

ఏటా 100 మస్టర్లు పూర్తి చేయని సింగరేణి కార్మికులపై యాజమాన్యం కఠిన చర్యలకు ఉపక్రమించింది. వరుసగా విధులకు గైర్హాజరయ్యే వారిపై వేటు వేసేందుకు సరికొత్త యాక్షన్ ప్లాన్ను అమలు చేస్తోంది.
నిబంధనలు ఉల్లంఘిస్తే ఇంక్రిమెంట్ల కోత, డిమోషన్తో పాటు మూడేళ్లలో ఉద్యోగ తొలగింపు వరకు చర్యలు ఉంటాయి. కార్మికులు బాధ్యతతో విధులకు హాజరు కావాలని, లేనిపక్షంలో కఠిన పరిణామాలు తప్పవని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...