వార్తలకు తిరిగి వెళ్లండి
దివ్యాంగుడి ఇందిరమ్మ ఇల్లు వివాదం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కుమురంభీం చౌరస్తా కాలనీకి చెందిన దివ్యాంగుడు పెంద్రం యశ్వంత్రావుకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని భావించి పిల్లర్ల వరకు నిర్మాణం పూర్తి చేసుకున్నాడు.
అయితే ప్రొసీడింగ్ కంటే ముందే నిర్మాణం మొదలుపెట్టడంతో ఇల్లు మంజూరు కాలేదని, బిల్లు రాదని అధికారులు చెప్పడంతో ఆ కుటుంబం తీవ్ర నిరాశలో మునిగిపోయింది. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వేడుకుంటోంది.
Comments
Loading comments...