వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 2,77,882 మంది ఓటర్లకు గాను 2,41,949 ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయింది. దీంతో 87.07 శాతం ప్రక్రియ పూర్తయినట్లు అధికారులు తెలిపారు.
మిగిలిన 35,933 ఫారాలు తిరిగి తీసుకోలేని జాబితాలో ఉన్నట్లు సమాచారం. ఇందులో 22,719 మంది ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, 6,255 మంది మృతులు ఉన్నారు. ఈ వివరాలను ఈనెల 17న ముసాయిదా ఓటరు జాబితాలో వెల్లడించనున్నారు.
Comments
Loading comments...

