వార్తలకు తిరిగి వెళ్లండి

మీసేవ కేంద్రాల్లో ఇకపై కాగితపు రసీదులకు బదులుగా డిజిటల్ రసీదులను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. పారదర్శకత, వేగవంతమైన సేవలే లక్ష్యంగా ఈ పేపర్లెస్ విధానాన్ని జిల్లాలోని 192 కేంద్రాల్లో ఇప్పటికే అమలులోకి తెచ్చారు.
దరఖాస్తు చేసుకున్న వెంటనే మొబైల్కు వచ్చే లింక్ ద్వారా రసీదును డౌన్లోడ్ చేసుకోవచ్చు. సాంకేతిక సమస్యలు తలెత్తితే రసీదును తిరిగి పొందే వెసులుబాటు కూడా కల్పించారు. పౌరులు ఈ డిజిటల్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

