వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంద్రానగర్ తండాలో పారిశుద్ధ్య పనులను సర్పంచ్ మలావత్ బాలునాయక్ ఆధ్వర్యంలో చేపట్టారు. గ్రామంలోని ప్రధాన వీధులు, పరిసర ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారం తొలగించి పరిశుభ్రత చర్యలు చేపట్టారు.
ప్రజలు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ పారిశుద్ధ్య సిబ్బందికి సహకరించాలని సర్పంచ్ బాలునాయక్ సూచించారు. గ్రామంలో పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా నిరంతరం పారిశుద్ధ్య పనులు చేపడుతున్నామని తెలిపారు.
Comments
Loading comments...

