వార్తలకు తిరిగి వెళ్లండి

ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరడంతో గోదావరి ఉద్ధృతి కొనసాగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద శుక్రవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 10.90 అడుగులకు చేరింది.
దీంతో సముద్రంలోకి 2,36,870 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. కాలువలకు సాగునీటి అవసరాల కోసం 11,500 క్యూసెక్కులు వదులుతున్నట్లు జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

