వార్తలకు తిరిగి వెళ్లండి

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. వరుస సెలవులతో తెలంగాణ, ఏపీ నుంచి భక్తులు రావడంతో ఉచిత దర్శనానికి నాలుగు గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర సమయం పట్టింది.
భక్తుల రద్దీతో కొండపైన, కింద పార్కింగ్ స్థలాలు నిండిపోయాయి. ఆదివారం ఆలయానికి రూ.64.77 లక్షల ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో ప్రసాదాల విక్రయం ద్వారా రూ.35.71 లక్షలు వచ్చాయి.
Comments
Loading comments...

