వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణBreaking
శివాలయాలకు పోటెత్తిన భక్తులు
మాస శివరాత్రి, ఆరుద్ర నక్షత్రం ఒకేరోజు రావడంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. ప్రముఖ క్షేత్రాలైన శ్రీశైలం, వేములవాడ రాజన్న ఆలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు భారీగా తరలివచ్చారు.
శ్రీశైలంలో భక్తుల రద్దీ దృష్ట్యా అధికారులు వీఐపీ బ్రేక్ దర్శనాలను తాత్కాలికంగా రద్దు చేశారు. స్వామివారి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు.
Comments
Loading comments...