వార్తలకు తిరిగి వెళ్లండి
ఒంటికాలిపై గోల్కొండ కోటెక్కిన భక్తుడు

గోషామహల్కు చెందిన కార్తిక్ అనే యువకుడు శారీరక వైకల్యాన్ని అధిగమించి, ఒంటికాలిపైనే ఎత్తైన గోల్కొండ కోటెక్కి జగదాంబ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నాడు. మూడేళ్ల క్రితం ఇన్ఫెక్షన్ కారణంగా వైద్యులు అతడి ఎడమ కాలును తొలగించారు.
అయినప్పటికీ సడలని సంకల్పంతో కార్తిక్ 120 మీటర్ల ఎత్తులో ఉన్న 365 మెట్లను ఏకబిగిన ఎక్కి తన మొక్కును తీర్చుకున్నాడు. ఈ అసాధారణ దృశ్యాన్ని చూసి అక్కడున్న భక్తులు ఆశ్చర్యపోయారు.
Comments
Loading comments...