వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ (SIR) అత్యంత నెమ్మదిగా సాగుతోంది. ఈ నెల 24వ తేదీతో గడువు ముగియనుండగా, ఇప్పటివరకు కేవలం 49.28 శాతం పనులు మాత్రమే పూర్తవడం అధికారుల్లో ఆందోళన కలిగిస్తోంది.
ఎన్యూమరేషన్ పత్రాలు తమకు అందలేదని చాలామంది ఓటర్లు ఫిర్యాదు చేస్తుండగా, పత్రాలు అందుకున్నవారు సమర్పించడంలో ఆలస్యం చేస్తున్నారు. వీటికి తోడు సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్లో నమోదు చేయడంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోంది.
Comments
Loading comments...

