వార్తలకు తిరిగి వెళ్లండి
కథువాలో ఉగ్ర స్థావరం ధ్వంసం: రెండు గ్రెనేడ్లు స్వాధీనం

జమ్మూ కాశ్మీర్లోని కథువా జిల్లా బిల్లావర్ అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు ఉగ్రవాదుల స్థావరాన్ని ధ్వంసం చేసి రెండు హ్యాండ్ గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నాయి. అరెస్టయిన ఓవర్ గ్రౌండ్ వర్కర్ హాజీ లతీఫ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ తనిఖీలు చేపట్టారు.
సరిహద్దుల నుంచి ఉగ్రవాదుల చొరబాట్లకు సహకరిస్తున్న లతీఫ్ను భద్రతా దళాలు విచారిస్తున్నాయి. కాగా, హీరానగర్ సెక్టార్లోని సరిహద్దు గ్రామంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక వ్యక్తిని సరిహద్దు భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి.
Comments
Loading comments...