Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యూపీలో టీచర్లకు రూ. 5 లక్షల క్యాష్‌లెస్ వైద్యం

విఘ్నేష్ రెడ్డి Jul 09, 2026 6:08 AM అల్ ఇండియా 10 views1 day ago
యూపీలో టీచర్లకు రూ. 5 లక్షల క్యాష్‌లెస్ వైద్యం - Udayam Digital
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య సహాయం అందించే 'ముఖ్యమంత్రి టీచర్స్ క్యాష్‌లెస్ మెడికల్ స్కీమ్'ను ప్రారంభించింది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వారణాసిలో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ప్రాథమిక, మాధ్యమిక విద్యా రంగాల్లోని సుమారు 15 లక్షల మంది ఉపాధ్యాయులు, శిక్షా మిత్రలు, వంట సిబ్బంది ప్రయోజనం పొందుతారు. అలాగే ఎస్‌బీఐతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా ఉద్యోగులకు భారీ ప్రమాద బీమా సౌకర్యం కూడా లభించనుంది.

Comments

G
Loading comments...