వార్తలకు తిరిగి వెళ్లండి

అత్యాచార కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధినేత గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు హర్యానా ప్రభుత్వం 30 రోజుల పెరోల్ మంజూరు చేసింది. దీంతో రోహ్తక్ జైలు నుంచి ఆయన విడుదలయ్యారు. డేరా బాబా పెరోల్పై రావడం ఇది 16వ సారి.
ఈ పెరోల్ కాలంలో ఆయన సిర్సాలోని డేరా ప్రధాన కార్యాలయంలో ఉంటారు. అయితే తన అనుచరులను, భక్తులను ఒకచోట చేర్చడానికి అనుమతి లేదు కానీ.. నిబంధనల ప్రకారం ఆయన వర్చువల్గా వారితో మాట్లాడవచ్చని అధికారులు స్పష్టం చేశారు.
Comments
Loading comments...

