వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ‘ఫ్రైడే-డ్రైడే’ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా పకడ్బందీగా అమలు చేయాలని అధికారులను పవన్ కల్యాణ్ ఆదేశించారు. పారిశుధ్యం, దోమల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.
గ్రామాల్లో బ్లీచింగ్, క్లోరిన్ బిళ్లలు అందుబాటులో ఉంచి, మురుగునీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన పెంచి, ఫాగింగ్ను క్రమం తప్పకుండా నిర్వహించాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.
Comments
Loading comments...

