Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకున్న డీఈవో రాజు

కృష్ణ మూర్తి Jul 25, 2026 3:28 PM మెదక్about 1 hour ago
ఏడుపాయల దుర్గమ్మను దర్శించుకున్న డీఈవో రాజు - Udayam Digital
మెదక్ జిల్లా విద్యాశాఖ అధికారిగా బాధ్యతలు చేపట్టిన రాజు శనివారం ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని మాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా వేద పండితులు డీఈవో రాజుకు ఏడుపాయల ఆలయ ప్రశస్తిని వివరించారు. ఆయన వెంట అక్షయ పాత్ర ప్లాంట్ మేనేజర్ త్రిపాఠి, పలువురు అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Comments

G
Loading comments...