Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురుకులాల కొనుగోళ్లపై సమగ్ర విచారణకు డిమాండ్

Follow Udayam on Google
అనురూప్ గౌడ్ Aug 13, 2026 6:27 PM భద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ
గురుకులాల కొనుగోళ్లపై సమగ్ర విచారణకు డిమాండ్ - Udayam
కొత్తగూడెంలో సాంఘిక సంక్షేమ గురుకులాల టెండర్లు, కొనుగోళ్లలో పారదర్శకత పాటించాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు బుర్ర వీరభద్రం డిమాండ్‌ చేశారు. విద్యార్థుల సంక్షేమ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టాలని జోనల్‌ అధికారి అపర్ణకు వినతిపత్రం అందించారు. టెండర్‌దారులు, ప్రిన్సిపాళ్లు, అధికారుల మధ్య కుమ్మక్కు జరిగిందన్న ఆరోపణలు, అధిక ధరలకు కొనుగోళ్లు, నాణ్యతలేని సామగ్రి సరఫరాపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.

Comments

G
Loading comments...