వార్తలకు తిరిగి వెళ్లండి
కప్పరాడ భూదందాపై చర్యలకు డిమాండ్

విశాఖ కప్పరాడ సర్వే నంబర్ 13లోని ప్రభుత్వ భూమి ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు డిమాండ్ చేశారు. బర్మా కాందిశీకుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాకు ఆయన మద్దతు తెలిపారు.
ఈ విషయమై జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిశోర్కు వినతిపత్రం సమర్పించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో విలువైన ప్రభుత్వ భూములను కార్పొరేట్లకు కట్టబెడుతున్నారని ఆయన విమర్శించారు.
Comments
Loading comments...