వార్తలకు తిరిగి వెళ్లండి
ఢిల్లీకి వరద గండం

ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా హత్నికుండ్ బ్యారేజీకి వరద ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. దీంతో అప్రమత్తమైన హర్యానా అధికారులు ప్రాజెక్టు గేట్లను ఎత్తివేసి యమునా నదిలోకి పెద్ద ఎత్తున నీటిని విడుదల చేశారు.
ఈ వరద ప్రవాహం కారణంగా రాబోయే 48 నుంచి 72 గంటల్లో దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని యమునా నది నీటిమట్టం ప్రమాదకరంగా పెరిగే అవకాశం ఉందని నీటిపారుదల శాఖ అధికారులు అధికారికంగా హెచ్చరించారు.
Comments
Loading comments...