వార్తలకు తిరిగి వెళ్లండి

భీమిలి పరిధిలోని యాతపేట రాజుల తాళ్లవలసకు చెందిన డిగ్రీ విద్యార్థిని మైనపు లావణ్య (20) అదృశ్యమైంది. ఈ నెల 5న ఉదయం కాలేజీకి వెళ్లిన ఆమె తిరిగి ఇంటికి రాలేదు.
ఆచూకీ లభించకపోవడంతో తల్లి వరలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై జామి సురేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువతి వివరాలు తెలిస్తే భీమునిపట్నం పోలీస్స్టేషన్లో సమాచారం ఇవ్వాలని హెచ్సీ అమర్ కోరారు.
Comments
Loading comments...

