వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర మున్సిపాలిటీ కోయిల్సాగర్ రోడ్డులో నట్టలి తిమ్మమ్మ ఇంట్లో చోరీ జరిగింది. కుటుంబంతో శ్రీశైలం వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండటాన్ని గుర్తించారు.
ఇంట్లోని 5 తులాల బంగారం, 80 తులాల వెండి, రూ.10 వేల నగదు చోరీకి గురైనట్లు బాధితులు తెలిపారు.
ఈరోజు ఉదయం పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. సీఐ రామకృష్ణ, ఎస్ఐ భాస్కర్రెడ్డి వివరాలు సేకరించారు.
Comments
Loading comments...

