వార్తలకు తిరిగి వెళ్లండి
స్పెయిన్లో పెద్దపల్లి యువకుడి మృతి
రేఖ దేవి Jun 29, 2026 5:24 AM పెద్దపల్లి 3 viewsabout 3 hours ago

పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కూనారం గ్రామానికి చెందిన గీట్ల సాయి అఖిల్రెడ్డి (30), స్పెయిన్లోని వేలెన్సియా నగరంలో భవనంపై నుంచి పడి మృతి చెందాడు. గత ఆరు నెలలుగా అక్కడ హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్న అతను ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు.
ఏకైక కుమారుడిని కోల్పోయిన తల్లిదండ్రులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనతో కూనారం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Comments
Loading comments...