Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా ప్రమాదం.. స్వగ్రామంలో విషాదం

Follow Udayam on Google
కీర్తన్ Aug 17, 2026 11:12 AM అన్నమయ్యGeneral
అమెరికా ప్రమాదం.. స్వగ్రామంలో విషాదం - Udayam
అమెరికాలో ఇటీవల జరిగిన కారు ప్రమాదంలో మృతి చెందిన బొంగుటావుల దిలీప్ కుమార్ మృతదేహాన్ని చిట్వేలు మండలం జట్టువారిపల్లికి తీసుకువచ్చారు. మృతదేహం స్వగ్రామానికి చేరడంతో కుటుంబసభ్యులు, బంధువులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. తల్లిదండ్రుల ఆర్తనాదాలతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. వారిని చూసి గ్రామస్థుల కళ్లలోనూ కన్నీళ్లు తిరిగాయి.

Comments

G
Loading comments...