Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవార్డు అందుకున్న మరుసటిరోజే మృతి

Follow Udayam on Google
విహార్ Aug 16, 2026 3:21 PM మహబూబ్‌నగర్తెలంగాణ
అవార్డు అందుకున్న మరుసటిరోజే మృతి - Udayam
గద్వాల మండలం చెనుగొనిపల్లికి చెందిన 108 ఎమర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్‌ జహంగీర్‌ బాషా(28) గుండెపోటుతో మృతిచెందారు. అర్ధరాత్రి ఛాతీలో నొప్పి రావడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయారు. శనివారం స్వాతంత్య్ర వేడుకల్లో కలెక్టర్‌ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న బాషా, 24 గంటల వ్యవధిలోనే మృతిచెందడంతో కుటుంబంలో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...