వార్తలకు తిరిగి వెళ్లండి
అమెరికాతో డీల్ క్యాన్సల్ కాలేదు: పీయూష్

అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని భారత్ తిరస్కరించిందన్న అంతర్జాతీయ మీడియా కథనాలను కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తీవ్రంగా ఖండించారు. అవన్నీ ముమ్మాటికీ తప్పుడు వార్తలని ఆయన ట్విట్టర్ వేదికగా స్పష్టం చేస్తూ అసలు విషయాన్ని వెల్లడించారు.
జూన్లో యూఎస్ ప్రతినిధులతో జరిగిన చర్చలు సంతృప్తికరంగా సాగాయని, ఇరు దేశాలు ఒప్పందానికి కట్టుబడి ఉన్నాయని తెలిపారు. వ్యాపారులు, రైతులు, వినియోగదారుల లబ్ధి కోసమే ఇరు బృందాలు కృషి చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...