Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజే సీజ్.. యజమానిపై కేసు నమోదు

Follow Udayam on Google
Saychi kumar Sep 12, 2026 6:52 PM కామరెడ్డిGeneral
డీజే సీజ్.. యజమానిపై కేసు నమోదు - Udayam
కామారెడ్డి మండలం లింగాయపల్లిలో నిబంధనలకు విరుద్ధంగా పెద్ద శబ్దంతో డీజే పెట్టి గ్రామస్థులకు ఆటంకం కలిగించిన సంఘటనపై పోలీసులు చర్యలు చేపట్టారు. శబ్ద కాలుష్యంతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం అందడంతో సిబ్బంది శుక్రవారం క్షేత్రస్థాయికి చేరుకుని డీజేను సీజ్ చేశారు. ప్రజలకు భంగం కలిగించిన డీజే యజమానిపై కేసు నమోదు చేసినట్లు SI రంజిత్ తెలిపారు.

Comments

G
Loading comments...